శ్రీనగర్ : పుల్వామా జిల్లా మీజ్ పాంపుర్ ప్రాంతంలో భారత సైన్యం చేసిన దాడిలో అనుమానిత ఉగ్రవాది మరణించినట్లు అధికారులు తెలిపారు. గురువారం తెల్లవారు జాము నుంచి కాల్పులు ప్రారంభమయ్యాయి. మృతుడిని గుర్తించాల్సి ఉంది. కాల్పులు కొనసాగుతున్నాయని వివరించారు. ఉగ్రవాదుల కోసం అవతిపొరా, మీజ్ పాంపురాలో భద్రతా దళాలు గాలింపులు చేసినపుడు ఉగ్రవాదులు కాల్పులకు దిగారన్నారు.