సుశాంత్ కేసులోకి మరో కీలక వ్యక్తి..

సుశాంత్  కేసులోకి మరో కీలక వ్యక్తి..

బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్‌పుత్ మృతి కేసులో తాజాగా మరో కీలక విషయం వెలుగు చూసింది. సుశాంత్‌కు తాను క్లోజ్ ఫ్రెండ్‌నని మీడియా ఎదుట చెప్పిన ఫిల్మ్ మేకర్ సందీప్ ఎస్ సింగ్ గత ఏడాది కాలంగా సుశాంత్‌కు ఫోన్ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సుశాంత్ మృతి తర్వాత సందీప్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు.సుశాంత్ మరణించిన రోజు ఆయన ఇంట్లో పోలీసులకు సూచనలు ఇవ్వడం, సుశాంత్ మృతదేహానికి పోస్టుమార్టం జరిగిన కూపర్ ఆసుపత్రికి వెళ్లి అక్కడి వ్యవహారాలు చూసుకోవడం, అంత్యక్రియల్లో కీలకంగా వ్యవహరించడంతో సందీప్ ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. అంత్యక్రియల అనంతరం అతడు మాట్లాడుతూ సుశాంత్ తనకు చాలా దగ్గరి స్నేహితుడని చెప్పాడు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. సుశాంత్‌కు తాను క్లోజ్ ఫ్రెండ్‌నని చెప్పే సందీప్ గురించి సుశాంత్ తల్లిదండ్రులకు కానీ, అతడి సిబ్బందికి కానీ అతడెవరో తెలియకపోవడం.అయితే, అతడి మాటలకు, చేతలకు పొంతన లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సుశాంత్‌కు తాను క్లోజ్‌ఫ్రెండ్‌నని చెప్పుకుంటున్న సందీప్, గత ఏడాది కాలంగా సుశాంత్‌కు ఒక్కటంటే ఒక్క ఫోన్‌కాల్ కూడా చేయకపోవడం అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇందుకు సంబంధించిన కాల్‌డేటాను ఓ జాతీయ పత్రిక సంపాదించింది. ఇందులో గత 12 నెలల్లో సందీప్ నుంచి సుశాంత్‌కు ఒక్క ఫోన్‌ కూడా రాలేదు. కానీ అతడి మరణం తర్వాత ఒక్కసారిగా సుశాంత్ ఇంటి వద్ద ప్రత్యక్షమయ్యాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos