ఈ సర్జికల్ దాడులు ముందే జరిగి ఉంటే…

ఈ సర్జికల్ దాడులు ముందే జరిగి ఉంటే…

హైదరాబాద్ : పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళాలు చేసిన మెరుపు దాడి పట్ల యావత్ భారత్ హర్షం వ్యక్తం చేస్తోంది. సర్జికల్ స్ట్రైక్-2తో భారత వాయుసేన.. పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్లకు ఘన నివాళులర్పించిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారత వైమానిక దళం జరిపిన ఈ ప్రతీకార దాడుల్లో సుమారు 200 నుంచి 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. ఈ దాడిపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈ సర్జికల్ దాడులు 12 రోజుల ముందే జరిగుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఆలస్యమైనా ఈ సర్జికల్ దాడిని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఉగ్రవాదులకు భారత్ గట్టి జవాబు ఇచ్చిందన్నారు. ఈ విషయంలో భారత ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఉంటుందన్నారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos