న్యూ ఢిల్లీ: అండమాన్ – నికోబార్ దీవుల నుంచి నౌకా విధ్వంసక క్షిపణిని భారత నావికా దళం మంగళ వారం పరీక్షించింది. ఇది 400 కి.మీ దూరంలో ఉన్న లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) దీన్ని రూపొందించింది. ఇటీవల క్షిపణి లక్ష్యాన్ని 298 నుంచి 450 కి.మీ కి పెంచింది.