మరో 5 రోజులు మండే ఎండలు

మరో 5 రోజులు మండే ఎండలు

న్యూ ఢిల్లీ : దేశంలోని అనేక ప్రాంతాల్లో రాబోయే ఐదు రోజుల పాటు ఎండతోపాటు వేడిగాలులు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రధానంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్లోని పలు ప్రాంతాల్లో వేడి పరిస్థితులు కొనసాగుతాయని వెల్లడించింది. గాలిలో అధిక తేమ కారణంగా కోస్తా ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కర్నాటక, గోవా, కేరళ, పశ్చిమ బెంగాల్, బీహార్లలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని సూచించింది. ఏప్రిల్ 22, ఏప్రిల్ 23 తేదీలలో తూర్పు మధ్యప్రదేశ్లో రాత్రి ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. అయితే రాత్రి పూట ఉష్ణోగ్రత ప్రమాదకరమని, శరీరం చల్లబడేందుకు అవకాశం తక్కువగా ఉంటుందని తెలిపింది. వాతావరణ శాఖ ప్రకారం ఏప్రిల్లో దేశంలోని వివిధ ప్రాంతాలలో సాధారణంగా ఒకటి నుంచి మూడు రోజుల వ్యవధితో పోలిస్తే నాలుగు నుంచి ఎనిమిది రోజుల పాటు వేడి తరంగాలు ఉండే అవకాశం ఉందని చెప్పింది. సాధారణంగా నాలుగు నుంచి ఎనిమిది రోజులతో పోలిస్తే మొత్తం ఏప్రిల్-జూన్ కాలంలో 10 నుంచి 20 రోజుల పాటు వేడి గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos