పవన్‌ ఇంట్లో జరిగితే..ఆ బాధ తెలుస్తుంది

పవన్‌ ఇంట్లో జరిగితే..ఆ బాధ తెలుస్తుంది

గుంటూరు: అత్యాచారం చేసిన వారికి రెండు దెబ్బలు చాలని నటుడు పవన్ కళ్యాణ్ పేర్కొనటం అత్యంత ఘోరమని సీనియర్ నటుడు సుమన్ వ్యాఖ్యానించారు. గురువారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడారు. ‘అలాంటి ఘటనలు వారింట్లో జరిగితే పవన్ ఇలాగే అంటారా ? ఇలాంటి ఘటనల్లో బాధితుల ఆవేదనను అర్థం చేసుకుని మాట్లాడాల’ని పవన్కు హితవు పలికారు. అత్యా చారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ‘వైద్యురాలిపై అత్యాచారం చేసిన నలు గురిని జైల్లో పెడితే జైలు దగ్గరకు వేలమంది వెళ్లి ఉరి తీయాలని, చంపేయాలని అంటున్నారు. ఢిల్లీ స్థాయిలో ఓ జడ్జి రేప్ కేసు గురించి మాట్లాడుతూ మగ వాళ్ల మర్మాంగాలను కోసే యండన్నారు. అంత స్థాయికి ఎందుకు తీసుకువెళుతున్నారు. ఆడ పిల్ల బయటకువెళ్లి ఇంటికి తిరిగిరాకపోతే ఆడపిల్ల మీద ఏదైనా జరిగితే. చేసిన అబ్బాయిని రెండు బెత్తం దెబ్బలు చెమ్డాలు ఊడి పోయేలా కొట్టాలి. అందరూ చూస్తుండగా కొట్టాలి’ అని పవన్ పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై మహిళలు, మేధావు లు, రాజకీయ నాయకులు మండి పడుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos