సుజనా చౌదరికి సీబీఐ సమన్లు

సుజనా చౌదరికి సీబీఐ సమన్లు

బెంగళూరు : కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి సీబీఐ బెంగళూరు శాఖ గురువారం సమన్లు జారీ చేసింది. 2017లో నమోదు చేసిన ఓ కేసుకు సంబంధించి దర్యాప్తు నిమిత్తం శుక్రవారం హాజరు కావాలని సూచించింది. బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ కంపెనీ పేరిట సుజనా చౌదరి బ్యాంకులకు కోట్ల రూపాయల నష్టం కలిగేలా చేశాడని ఆరోపణలున్నాయి. ఆంధ్రా బ్యాంకును రూ.71 కోట్ల మేరకు మోసం చేశాడనే ఆరోపణలకు సంబంధించి తమ ఎదుట హాజరు కావాలని సీబీఐ అధికారులు సూచించారు. మధ్యాహ్నం సుజనా సీబీఐ ఎదుట హాజరవుతారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos