అన్నదాత ఆత్మహత్య

అన్నదాత ఆత్మహత్య

గుంటూరు : అప్పుల బాధలను తాళలేక గురజాల మండలం మాడుగుల కౌలు రైతు మరియ దాసు (39) సోమవారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు ఇక్కడ తెలిపారు. ఎస్సీ కాలనీకి చెందిన పేరుపోగు మరియదాసు (39)గత నాలుగేళ్లుగా అయిదు ఎకరాల పొలాన్ని కౌలుకి సాగు చేస్తున్నాడు. ఈ ఏడాది వరి, మిరప, మూడు ఎకరాల పత్తిని సాగు చేశాడు. ప్రతి ఏటా పంటకు సరైన దిగుబడి రాక, సాగు వ్యయం పెరిగి దాదాపు రూ.8 లక్షలకు పైగా అప్పుల పాలయ్యాడు. అప్పులు తీర్చే మార్గం లేక మనస్థాపానికి గురైన రైతు పొలంలో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన పక్క పొలం రైతులు వెంటనే మరియ దాసును పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రైతు మృతి చెందాడు. మరియదాసుకు ఇద్దరు ఆడ పిల్లలు, ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. గురజాల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో మరియదాసు బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos