న్యూ ఢిల్లీ:సీఏఏ వ్యతిరేక ఆందోళన నియంత్రణకు సైన్యాన్ని రంగంలోకి దించాలని భాజపా సీనియర్ నేత సుబ్రమణియన్ స్వామి కేంద్ర హోం మంత్రి అమిత్ షా,రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్కు మంగళవారం ఇక్కడ సలహా ఇచ్చారు.‘ఇలాంటి అల్లర్ల అణచివేతకు సైన్యాన్ని రంగంలోకి దింపడం ప్రజాస్వామ్య సంప్రదాయపరంగా తీవ్ర చర్యే. అయినా హింసను రూపుమాపి ముఖ్యంగా ప్రజాస్వామ్యం కొనసాగేందుకు అవసరమైన వాతా వరణాన్ని కల్పిస్తుంది. సీఏఏ వ్యతిరేక నిరసనలు అంటే జాతి వ్యతిరేక చర్యలేన’ని పేర్కొన్నారు.