పాకిస్థాన్‌లోని గురుద్వారాపై రాళ్ల దాడి..

పాకిస్థాన్‌లోని గురుద్వారాపై రాళ్ల దాడి..

పాకిస్థాన్‌ దేశంలో మైనారిటీలపై దాడులు రోజురోజుకు తీవ్రతరమవుతున్నాయి.తాజాగా గురునానక్ జన్మించిన పాకిస్థాన్లోని నాన్కానాలో ఉన్న సిక్కుల ఆలయం సాహిబ్ గురుద్వారాపై పాకిస్థాన్‌ ముస్లింలు రాళ్లతో దాడులకు తెగబడ్డారు. దీంతో సిక్కులు భయంతో వణికిపోయారు. ప్రాణాలు అరచేత పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఘటనపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. దాడిని తీవ్రంగా ఖండించింది. సిక్కులను లక్ష్యంగా చేసుకుని పాక్లో దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని కోరింది. మరోవైపు పంజాబ్ ముఖ్యమంత్రి కూడా ఘటనపై స్పందించారు. గురుద్వారాలో చిక్కుకున్న భక్తులను ఆందోళనకారుల రాళ్లదాడి నుంచి వెంటనే రక్షించాలని కోరారు.గతేడాది ఆగస్టులో సిక్కు యువతి జగ్జీత్ కౌర్‌‌ను అపహరించిన దుండగులు మతమార్పిడి చేసి పెళ్లి చేసుకున్నారు. తర్వాత మళ్లీ ఇలా ఘటనలు జరగడం గర్హనీయమని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. నాన్కానా సాహిబ్ గురుద్వారా పవిత్రతను కాపాడతామంటూ గతంలో ఇచ్చిన హామీ ఏమైందని పాక్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos