ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో వ్యాపారాల్ని ప్రారంభించాయి. తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో బీఎస్ఈ సెన్సెక్స్ 512పాయింట్లకు పైగా లాభపడి 50,092 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 169 పాయింట్లకు వృద్ధి చెంది 15,092 వద్ద ఉన్నాయి. టాటాస్టీల్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ బ్యాంక్, ఎల్ అండ్ టీ షేర్లు లాభాల్లో ,నెస్లే, భారతీ ఎయిర్ టెల్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.