న్యూఢిల్లీ : తమిళనాడులో నీట్ పరీక్షకు బదులుగా మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి సొంత ప్రవేశ పరీక్ష నిర్వహణకు వీలు కల్పించేందుకు శాసనసభ ఆమోదించిన ముసాయి దాను గవర్నర్ ఆర్ఎన్ రవి గురువారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం కోసం కేంద్ర హోం శాఖకు పంపారు. ‘రాజ్యాంగ నిబంధనలకు లోబడి మాత్రమే నీట్ వ్యతిరేక ముసాయిదాను గవర్నర్.. కేంద్ర హోం శాఖకు పంపారు. రాష్ట్రపతి దీన్ని ల్లును తిరస్కరిస్తార’ని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై అన్నారు. నీట్ పరీక్షకు కొన్ని గంటల ముందు సేలంలోని 19 ఏళ్ల వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నందున తమిళనాడు నీట్ వ్యతిరేక ముసాయిదాను చట్టసభలో ప్రవేశపెట్టింది.