‘రామ భక్తు’ల దౌర్జన్యం

‘రామ భక్తు’ల దౌర్జన్యం

ముంబై :థానెలో జై శ్రీరాం అని నినదించని కారు డ్రైవర్ ఫైజల్ ఉస్మాన్ ఖాన్ పై గురువారం మద్యం సేవించిన ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడి నట్లు పోలీసులు తెలిపారు. థానేలోని దివా ప్రాంతంలో ఫైజల్ ఉస్మాన్ ఖాన్ నడుపుతున్న కారును మోటారు సైకిలుపై వచ్చిన నిందితులు అటకాయించి జై శ్రీరాం అనాలని బెదిరించారు. లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవంటూ దాడి చేసారు. తాను ముస్లింనని గ్రహించి, కారు నుంచి బయటకు లాగి కొట్టారని చెప్పారు. జై శ్రీరాం అంటేనే వదలి పెడతామని బెదిరించారన్నారు. క్యాబ్ ప్రయాణీకుల్లో ఒకరు పోలీసులకు ఫోన్ చేసారు. దీంతో దుండగులు డ్రైవర్ మొబైల్ ఫోన్ను లాక్కుని పరారయ్యారు. బాధితుడు పోలీసులకు దుండగులకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసారు. అందులో వారు వచ్చిన మోటారు సైకిలు రిజిస్ర్టేషన్ సంఖ్యనూ పేర్కొన్నాడు.దరిమిలా వాహనాన్ని గుర్తించి నిందితులు- జైదీప్ ముండే, మంగేష్ ముండే, అనిల్ సూర్యవంశీని పోలీసులు నిర్బంధించి విచారిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos