ఐఎన్ఎస్ విరాట్‌ను విక్రయించనున్న శ్రీరామ్ గ్రూపు

ఐఎన్ఎస్ విరాట్‌ను విక్రయించనున్న శ్రీరామ్ గ్రూపు

ఐఎన్ఎస్ విరాట్ యుద్ధనౌకను విక్రయించడానికి శ్రీరామ్ గ్రూపు సిద్ధమవుతోంది. 1987లో ఇండియన్ నేవీలో చేరిన ఈ నౌక దేశానికి ఎన్నో సేవలందించి 2017లో విధుల నుంచి తప్పుకుంది. గత ఏడాది దీన్ని వేలం వేయగా శ్రీరామ్ గ్రూప్ రూ. 38.54 కోట్లకు దక్కించుకుంది. అనంతరం దీనిని గుజరాత్ తీరంలోని అలంగ్ వద్ద ఉన్న యార్డుకు చేర్చారు. ఈ యుద్ధ నౌకను మ్యూజియంగా మార్చాలని ముంబైకి చెందిన ఎన్విటెక్ మెరైన్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ భావిస్తోంది. ఈ నేపథ్యంలో భారత రక్షణశాఖ నుంచి ఎన్ఓసీ రాగానే రూ.100 కోట్లకు సదరు సంస్థకు విక్రయించేందుకు అంగీకరించినట్టు శ్రీరామ్ గ్రూపు ప్రతినిధి చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos