‘దళిత ఎమ్మెల్యే రాక గణపతి మైల’

‘దళిత ఎమ్మెల్యే రాక గణపతి మైల’

అమరావతి: తుళ్లూరు మండలం అనంతవరంలో సోమవారం సాయంత్రం వినాయక చవితి వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన వైకాపా శాసనసభ్యులు డాక్టర్ ఉండవల్లి శ్రీదేవిని నిర్వాహకులు కులం పేరిట దూషించారు. దళితులు వేడుకలకు హాజరైతే వినాయకుడు మైలపడతాడని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో శ్రీ దేవి కంటతడి పెట్టారు. తనకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యుల గతేంటని ఆవేదన వ్యక్తం చెందారు. మంగళవారం ఇక్కడ ఆమె విలేఖరులతో మాట్లాడారు. ‘కుల వివక్ష అనేది రాష్ట్ర రాజధానిలో కనిపించడం దారుణం. సామాజిక వర్గం పేరుతో నన్ను మానసికంగా కుంగతీశారు. వినాయకుడిని ముట్టుకుంటే మైల పడుతుందని ఒక సామాజిక వర్గం నేతలు నన్ను దూషించారు. రాజధానిలో జరుగుతున్న అవినీతిని వెలికి తీసినందుకే నన్ను మానసికంగా వేధిస్తున్నారు. చెప్పరాని మాటలంటున్నారు. గతంలో చంద్రబాబు దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని మాట్లాడారు. యథా రాజా తదా ప్రజా అన్నట్లు ఆయన బాటలోనే తెదేపా నాయకులు నడుస్తు న్నారు. వారికి కుల రాజకీయం తలకెక్కింది. గతంలో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి దళితులు శుభ్రంగా ఉండరని చుల కనగా మాట్లాడారు. ఇంతటి కుల వివక్ష దేశంలో ఎక్కడా చూడ లేదు. నన్ను కులం పేరుతో తిట్టిన వారినే కాకుండా చంద్ర బాబు నాయుడునూ కూడా అరెస్టు చేయాలి. తనపై కుల వివక్షతకు పాల్పడిన వారిని పెంచి పోషించింది చంద్ర బాబే. రాజధానిలో దళితులను చిత్ర వధ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ ఒక దళిత నేతేనా. ఒక దళిత మహిళకు అన్యాయం జరిగితే చూస్తూ ఉరుకుంటారా. రాజధానిలో భూములు ఇచ్చిన దళితులకు ప్యాకేజీలో వివక్ష చూపించారు. టీడీపీ నేతల దాడులను తట్టుకునే పరి స్థితిలో దళితులు లేరు. దళితులు తెదేపా పై తిరగబడే రోజులు దగ్గర పడ్డాయి. నన్ను దూషించిన వారిని అరెస్ట్ చేయ డమే కాకుండా కఠినంగా శిక్షించాలి’ అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos