న్యూ ఢిల్లీ : శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం అక్కడి పౌరుల జీవితాలను నరకప్రాయం చేస్తున్నది. కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో వారు దినదిన గండంగా జీవితాలను వెళ్లదీస్తున్నారు. దీంతో కొందరు ఆ దేశం నుంచి మన దేశంలోకి శరణార్థులుగా వస్తున్నారు. శుక్రవారం రెండు కుటుంబాలకు చెందిన ఏడుగురు భారత తీరానికి వచ్చి శరణార్థులుగా స్వీకరించాలని అభ్యర్థించారు. వీరితో కలిపి మార్చి 22 నుంచి ఇప్పటి వరకు త్రింకోమాలీ, మన్నార్ యళపానం, వవూనియాల ప్రాంతాల నుంచి 90 మంది శ్రీలంక పౌరులు శరణార్థులుగా వచ్చారు. వారిని రామేశ్వరంలోని మండపం శరణార్థుల శిబిరానికి అధికారులు పంపా