న్యూఢిల్లీ: వేళ్లతో బంతిని అద్భుతంగా తిప్పే టీమిండియా టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ జట్టుకు బాగా ఉపయోగపడతాడని, అతడిని కూడా పట్టించుకోవాలని మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ బీసీసీఐకి సూచించాడు. మణికట్టు స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ల రాకతో సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పూర్తిగా వన్డే, టీ20లకే పరిమితమయ్యాడు. చాహల్, కుల్దీప్ ఇద్దరూ గత ఏడాది కాలంగా మెరుగ్గా రాణిస్తుండడంతో ప్రపంచకప్లోనే వీరిని ఆడించాలని జట్టు మేనేజ్మెంట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ ఆటగాడు గౌతం గంభీర్ మాట్లాడుతూ.. అశ్విన్ గురించి కూడా పట్టించుకోవాలని మేనేజ్మెంట్కు సూచించాడు. అశ్విన్ చేతి వేళ్లతో బంతిని అద్భుతంగా తిప్పుతాడని పేర్కొన్నాడు. ప్రపంచకప్ జరగనున్న ఇంగ్లండ్ పిచ్లు అశ్విన్ బౌలింగ్కు సరిగ్గా కుదురుతాయన్నాడు. ప్రపంచకప్ సమయంలో ఒకవేళ ఫ్లాట్ పిచ్లు ఎదురైతే అప్పుడు అశ్విన్ జట్టుకు బాగా ఉపయోగపడతాడని పేర్కొన్నాడు. కుల్దీప్, చాహల్కు తోడు అశ్విన్ కూడా ఉంటే జట్టుకు అదనపు బలం వస్తుందన్నాడు.