చెన్నై : నగర వాసులు నీటి కోసం అల్లాడుతున్న తరుణంలో రజనీకాంత్ కుమార్తె సౌందర్య షేర్ చేసిన ఓ ఫొటో ఆమెను విమర్శలపాల్జేసింది. తన కుమారుడు వేద్తో కలసి స్విమ్మింగ్పూల్లో ఉన్న ఫొటోను ఆమె షేర్ చేశారు. దీనిపై ఆమె ఊహించని విధంగా ప్రతికూల స్పందన వచ్చింది. తమిళనాడు ప్రజలు నీటి కోసం అలమటిస్తుంటే, మీరు మాత్రం ఇలా ఈత కొలనులో నీటిని వృథా చేస్తారా…అంటూ నెటిజన్లు ట్రోలింగ్కు దిగారు. దీంతో ఆమె తన ఫొటోలను తొలగించారు. చిన్నతనం నుంచే పిల్లలకు శారీరక వ్యాయామం అవసరమని చెప్పాలనే ఉద్దేశంతో ఈ ఫొటోను షేర్ చేశాను. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న నీటి కొరత నేపథ్యంలో ఈ ఫొటోను తొలగించాను అని ఆమె వివరణ ఇచ్చారు. అయితే రజనీ అభిమానులు ఆమెకు అండగా నిలిచారు. పాత ఫొటోతో మిమ్మల్ని ట్రోల్ చేస్తున్న వారిని పట్టించుకోకండి, నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి తలైవా చేస్తున్న సహాయం వారికి కనిపించడం లేదు…అంటూ ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చారు.