టీకా విషయంలో చేతులు దులుపుకున్న కేంద్రం

టీకా విషయంలో చేతులు దులుపుకున్న కేంద్రం

న్యూ ఢిల్లీ: ‘మోదీ సర్కారు టీకాలు వేసే బాధ్యత రాష్ట్రాలకు అప్పగించి, చేతులు దులుపుకుంది. అందరికీ ఉచితంగా టీకాలు అందిస్తే ఆర్థిక వ్యవస్థకు  వచ్చిన ముప్పేమీ లేద’ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పేర్కొన్నారు. సోమవారం ఇక్కడ జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సభ్యులు సమావేశంలో ఆమె ప్రసంగించారు. ఇటీవల ముగిసిన నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల్లో తమ వైఫల్యాలపై చర్చించేందుకు సీడబ్ల్యూసీ సభ్యులు భేటీ అయింది. తాజా ఎన్నికల్లో ఓటమితో పాటు వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలపైనా కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశంలో దృష్టిసారించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos