24 న కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం

24 న కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం

న్యూఢిల్లీ : సమకాలీన రాజకీయ, పార్టీ పరిస్థితుల గురించి చర్చించడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వచ్చే గురువారం కీలక సమావే శాన్నినిర్వహించనున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు, అన్ని రాష్ట్రాల ఇన్చార్జీలు, పీసీసీ అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ జరపనున్నారు. అన్ని రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి, క్షేత్ర స్థాయిలో పార్టీ కార్యకర్తల అనుభవాలను సేకరించనున్నారు. యువ నేతలు పార్టీని వీడుతుండటం, అంతర్గత కుమ్ములాటలు, కేంద్ర ప్రభుత్వ విధానాలు, కోవిడ్ అంశాలు చర్చకు వస్తాయని పార్టీ వర్గాలు తెలిపాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos