మహిళా రిజర్వేషన్ ముసాయిదా మాదే

న్యూ ఢిల్లీ: చట్టసభల్లో మహిళలను 33 శాతం రిజర్వేషన్ కల్పించే ముసాయిదాను మంత్రివర్గ సమావేశం ఆమోదించటాన్ని విపక్షాలు స్వాగతించాయి. దీనిపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు తమదేనని ఆమె అన్నారు. మహిళల రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ఎప్పటి నుంచో పట్టుబడుతోందని చెప్పారు. మహిళా రిజర్వేషన్లు తమ కల అని అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ స్పందిస్తూ… ఈ బిల్లుకు కేంద్ర కేబినెట్ల ఆమోదం తెలపడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లులో ఉన్న వివరాల కోసం వేచి చూస్తున్నామని తెలిపారు. బిల్లును సీక్రెట్ గా రూపొందించ కుండా ప్రత్యేక పార్లమెంటు సమావేశాలకు ముందే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదని అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos