న్యూ ఢిల్లీ: భారత నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ‘రాష్ట్రపత్ని’ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ అధిర్ రంజన్ చౌధురి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ స్పందించారు. ఈ వ్యాఖ్యలపై అధిర్ ను క్షమాపణ చెప్పమని ఆదేశిస్తారా? అన్న మీడియా ప్రశ్నకు స్పందిస్తూ ఆయన ఇప్పటికే క్షమాపణ చెప్పారని సోనియా అ న్నారు. మరోవైపు తన వ్యాఖ్యలపై అధిర్ రంజన్ వివరణ ఇచ్చారు. తాను పొరపాటున ‘రాష్ట్రపత్ని’ అని సంబోధించానని అన్నారు. అంతేతప్ప రాష్ట్రపతిని కించపరిచే ఉద్దేశం తనకు లేదన్నారు. దీన్ని అధికార పార్టీ నేతలు పెద్దది చేస్తూ చూపిస్తున్నారని విమర్శించారు.