గోవధ నిరోధక ముసాయిదాను వ్యతిరేకిస్తాం

గోవధ నిరోధక ముసాయిదాను వ్యతిరేకిస్తాం

బెంగళూరు: గో వధ నిరోధక ముసాయిదాను వ్యతిరేకిస్తామని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధారామయ్య తెలిపారు. మంగళవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్) తయారు చేసిన ముసాయిదాల్ని మాత్రమే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రజల అవసరాలకు బదులుగా ఆర్ఎస్ఎస్ అజెండాకు ప్రాధాన్యమిస్తున్న మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తోంది. గో వధ నిరోధక ముసాయిదాను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. పశు మాంసం విక్రయంపై ఆధారపడి జీవిస్తున్న వారు రోడ్డున పడకూడదు. అంటే ఈ ముసాయిదాను వ్యతిరేకించాల్సిందే. దేశంలో అధికారంలో ఉన్నది బీజేపీయేనైనా, ఆర్ఎస్ఎస్ పాలన సాగిస్తున్నద’ని దుయ్యబట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos