పశువులకు చర్మ వ్యాధులు : రైతుల ఆందోళన

హొసూరు : పశువులకు వింత చర్మ వ్యాధులు సోకడంతో హొసూరు ప్రాంతంలోని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణగిరి జిల్లా సూలగిరి సమీపంలోని మేడుపల్లి గ్రామంలో పశువులకు, గొర్రెలకు చర్మ వ్యాధులు సోకాయి. ఎన్ని మందులు వాడినా తగ్గకపోగా మరింత వ్యాప్తి చెందుతున్నాయని, లక్షల రూపాయలు విలువ చేసే పశువులకు వింత వ్యాధి సోకడంతో తాము జీవనాధారం కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశు వైద్యులకు చూపించినా ఫలితం లేదని వాపోయారు. ఒక్క మేడుపల్లి గ్రామంలోనే 200కు పైగా గొర్రెలు, పాడి పశువులకు చర్మ వ్యాధి సోకిందని రైతులు తెలిపారు. ఈ చర్మ వ్యాధులను నయం చేయడంతో పాటు వాటి వ్యాప్తిని అరికట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos