మన్మోహన్ వ్యాఖ్యలను వినండి

మన్మోహన్ వ్యాఖ్యలను వినండి

ముంబై : దేశ ఆర్థిక వ్యవస్థపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ‘దేశ ప్రయోజనాల దృష్ట్యా’ వినాల్సిందేనని శివసేన భాజపాకు తన అధికార ప్రతిక –సామ్నా సంపాదకీయంలో సూచించింది. సింగ్ వ్యాఖ్యలపై ఎలాంటి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ వహించకూడదని హితవు పలికింది. రాజకీయ కోణంలోనూ చూడకూడదని పేర్కొంది. ‘గత 35 సంవత్సరాలుగా భారత ఆర్థిక వ్యవస్థను ఆయన దగ్గరి నుంచి చూస్తున్నారు. అందుకే ఆ విషయంపై మాట్లాడడానికి మన్మోహన్కు సర్వ హక్కులూ ఉన్నాయ’ని తెలిపింది. మోదీ సర్కార్ అసమర్థత నిర్వహణతోనే ఈ దుస్థితి తలెత్తిందని, ఇది చేజేతులా తెచ్చుకున్న సంక్షోభమని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos