దిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చాలంటూ పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద తెదేపా ఎంపీలు సోమవారం ఆందోళన చేశారు. తమిళనాడు మాజీ సీఎం ఎంజీ రామచంద్రన్ వేషధారణలో చిత్తూరు ఎంపీ శివప్రసాద్ నిరసన తెలిపారు. రాష్ట్రానికి న్యాయం చేయాలంటూ ఎంపీలు నినాదాలు చేశారు. విశాఖ రైల్వేజోన్పై ప్రకటన చేయాలంటూ డిమాండ్ చేశారు.