ముంబై: శివసేన అధిపతి ఉద్దవ్ థాకరే ఎల్లుండి నుంచి కరువు పీడిత ఔరంగాబాద్తో సహా పలు ప్రాంతాల్లో శివసేన పర్యటించనున్నారు. భాజపాతో అధికారాన్ని పంచుకోవటంలో తొందర లేదన్న విషయాన్ని పార్టీ శ్రేణులకు తెలియజేయడమే ఆయన పర్యటన ఆంతర్యంమని తెలిసింది. ముఖ్య మంత్రి పదవిపై శివసేన ఆశలు వదలుకుందని వచ్చిన వార్తలను ఆ పార్టీ నాయకత్వం తోసి పుచ్చింది. 50:50 ఫార్ములాకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పదవిని వదులుకునే ప్రసక్తే లేదని శివసేన స్పష్టం చేసింది. శివసేన ఎత్తుగడల్ని భాజపా నిశితంగా పరిశీలిస్తోంది.