తలనైనా తెగనరుక్కుంటా.. బీజేపీలో మాత్రం చేరను

తలనైనా తెగనరుక్కుంటా.. బీజేపీలో మాత్రం చేరను

న్యూ ఢిల్లీ : ‘‘బీజేపీలో చేరితే నాపై ఉన్న సీబీఐ, ఈడీ కేసులు ఎత్తివేస్తామని బీజేపీ నుంచి నాకు ఒక సందేశం వచ్చింది. తలను తెగ నరుక్కుంటాను కానీ భాజపాలో చేర బోను’’ అని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియా ట్విట్టర్ లో ప్రకటించారు. సీబీఐ దాడులపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వరుస విమర్శలు చేస్తూనే ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్ లో రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ప్రజలు కేజ్రీవాల్ కు ప్రధానిగా ఓ సారి అవకాశం ఇవ్వాలని సిసోడియా ఇప్పటికే పిలుపునివ్వడం తెలిసిందే. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ చేస్తున్న పనులను.. ముఖ్యంగా ఆరోగ్యం, విద్యా రంగాల్లో అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ చూడాలని సిసోడియా కోరడం గమనార్హం. గుజరాత్ పర్యటనలో ఈ ఇద్దరు నేతలు ఆరోగ్యం, విద్యకు సంబంధించి పలు హామీలు ఇవ్వనున్నట్టు పార్టీ వర్గాలు తెలి పాయి.నన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos