న్యూఢిల్లీ : అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా సోమవారం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వి చేసిన ట్వీట్ సంచలన మైంది. ప్రస్తుతం వివాదాంశంగా మారింది. ఓంకారాన్ని జపించడం వల్ల యోగా శక్తిమంతం కాదని, అల్లా అని అనడం వల్ల యోగా శక్తి తగ్గిపోదని ట్వీట్ చేశారు.