హైదరాబాద్ : సికింద్రాబాద్ సమీపంలో పోలీసులు భారీగా వెండి కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. బోయినపల్లి సీఐ రాజేశ్ తన బృందంతో విధులు నిర్వహిస్తున్న సమయంలో అనుమానంతో ఓ కంటైనర్ను తనిఖీ చేయగా, అందులో ఎనిమిది వేల కిలోల వెండి కడ్డీలు ఉన్నట్లు గుర్తించారు. లండన్ నుంచి ఈ వెండి వచ్చినట్లు సమాచారం. నగరంలోని వివిధ దుకాణాల్లో విక్రయించడానికి కంటైనర్లో తీసుకెళుతుండగా పోలీసుల కంటబడింది. ఈ కడ్డీల విలువ సుమారు. రూ.35 కోట్లు ఉంటుందని అంచనా. సక్రమ పద్ధతిలో వెండిని తరలిస్తున్నారా లేదా అనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.