మడికేరి : సభలు, సమావేశాల్లో పాకిస్తాన్ జిందాబాద్ లాంటి నినాదాలు చేసేవారిని అక్కడికక్కడే కాల్చి పారేయాలని స్థానిక ఎమ్మెల్యే అప్పచ్చు రంజన్ పిలుపునిచ్చారు. కొడగు జిల్లా కేంద్రం మడికేరిలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల బెంగళూరులో జరిగిన ఓ సమావేశంలో అమూల్య అనే యువతి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినదించిందని గుర్తు చేశారు. ఏదో ప్రోద్బలంతోనే ఆమె అలా నినదించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. కనుక దీనిపై సమగ్ర విచారణ జరిపించి, ఆ శక్తులను బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.