శెలవుల కోసం స్నేహితురాలిపై హత్య ప్రయత్నం..

శెలవుల కోసం స్నేహితురాలిపై హత్య ప్రయత్నం..

 పాఠశాలలో చదువుకునే సమయంలో శెలవుల కోసం విద్యార్థులు చిన్నచిన్న అబద్దాలు చెప్పడం అత్యంత సహజమే.జీవితంలో ప్రతిఒక్కరూ శెలవుల కోసం స్కూళ్లల్లో అబద్దాలు చెప్పే ఉంటారు.మరికొంత మంది ఇంట్లో వృద్ధులు చనిపోయారంటూ అబద్దాలు చెప్పి పాఠశాల ఎగ్గొడుతుంటారు.అయితే శెలవు కోసం తోటి విద్యార్థిని హత్య చేయడానికి ప్రయత్నించడం ఎప్పుడైనా విన్నామా లేక చూశామా?కానీ ఇది నిజంగానే జరిగింది.ఈ ఘటన జరిగింది ఎక్కడో విదేశాల్లోనో లేక ఉత్తరాదిలోను అనుకుంటే తప్పులో కాలేసినట్లే. తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకోవడం విస్మయపరుస్తోంది.శెలవుల కోసం తోటి విద్యార్థినిని హత్య చేసేందుకు కొందరు విద్యార్థినులు ప్రయత్నించడం స్థానికంగా సంచలనం కలిగించింది. మంచిర్యాల జిల్లాలోని చెన్నూరులో ఉన్న కస్తూర్బా ఆశ్రమ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న పూజ,శ్రీలేఖ,నందినిలు కొద్ది రోజులుగా శెలవుల కోసం తీవ్రంగా ప్రయత్నించారు.అయితే అందుకు అనుమతి లభించకపోవడంతో ఎవరైనా విద్యార్థినిని చంపేస్తే స్కూలుకు శెలవులు వస్తాయని భావించి హత్య చేయడానికి నిర్ణయించుకున్నారు.అందులో భాగంగా రమాదేవి అనే స్నేహితురాలిని ఎంచుకున్నారు. ముగ్గురూ కలిసి ప్లాన్ చేసి గదిలో నిద్రిస్తున్న రమాదేవిని గొతునులిమి హత్య చేయడానికి  ప్రయత్నిస్తున్న క్రమంలో రమాదేవి గట్టిగా కేకలు వేయడంతో మేల్కొన్న తోటి విద్యార్థులు వారి నుంచి రమాదేవిని రక్షించారు.దీంతో విద్యార్థినులు రమాదేవిని అక్కడే వదిలి పెట్టి పరారయ్యారు. ఇక విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ విద్యార్థినులను పిలిచి మందలించారు.పాఠశాల ఉపాధ్యాయుల, రమాదేవి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు హత్యాయత్నం చేసిన విద్యార్థులు పూజా, శ్రీలేఖ, నిందినిలపై కేసు నమోదు చేసి వారిని జువైనల్ హోంకు తరలించారు..

 

 

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos