హొసూరు : వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు గురువారం ఇక్కడ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి అన్బళగన్ సమక్షంలో అధికార అన్నా డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. కృష్ణగిరి జిల్లా హొసూరులో ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు పంపిణీ
చేయడానికి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజయ్యారు. లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు, ప్రభుత్వ ఆర్థిక సహాయం, వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగామూడు వేల మందికి పైగా లబ్ధిదారులు వివిధ పథకాల కింద ప్రభుత్వ సాయాన్ని అందుకున్నారు. అనంతరం వివిధ పార్టీల కార్యకర్తలు పార్టీలో చేరారు. మంత్రి వారికి కండువాలు కప్పి, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో అన్నాడీఎంకే జిల్లా శాఖ అధ్యక్షుడు బాలకృష్ణా రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.