తెరాస నిజమైన లౌకికవాద పార్టీ

తెరాస నిజమైన లౌకికవాద పార్టీ

సిద్దిపేట : రాష్ట్రంలో ముస్లింలు గర్వంగా, ఆత్మాభిమానంతో బతుకుతున్నారని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. బుధవారం
సిద్దిపేటలో రూ.3 కోట్లతో నిర్మించిన హజ్ హౌస్ ప్రారంభోత్సవంలో పాల్గొని మాట్లాడారు. తెరాస మాత్రమే నిజమైన లౌకికవాద పార్టీ అని కొనియాడారు. గురుకులాల ద్వారా రాష్ట్రంలో మైనారిటీలకు మంచి విద్య అందుతోందన్నారు. విదేశ విద్యకు కూడా భారీగా నిధులు ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని ప్రశంసించారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు మాట్లాడుతూ, కేసీఆర్ చూపిన దారిలోనే సిద్దిపేట అభివృద్ధి సాగుతోందన్నారు. మైనార్టీలకు ఉన్నత పదవులిచ్చి వారిపై అభిమానాన్ని సీఎం చాటుకున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలకు 204 ప్రత్యేక పాఠశాలలు ఉన్నాయని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos