త్రిపుర మాజీ ముఖ్యమంత్రిపై దాడి

త్రిపుర మాజీ ముఖ్యమంత్రిపై దాడి

అగర్తల: త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్పై సోమవారం పలువురు దుండగులు దాడి చేసారు. ఇటీవల దాడికి గురైన తమ పార్టీ కార్యకర్తల పరామర్వకు ఇక్కడి సంతిర్ బజార్కు వెళ్లిన మాణిక్ సర్కార్ను పలువురు అడ్డగించారు. గో బ్యాక్ సర్కార్ అని నినాదాలతో, నల్ల జెండాలు చేబట్టి నిరసించారు. ఇంకా సీపీఎం సీనియర్ నేతలపైనా రాళ్ల దాడి చేశారు. వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ‘ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన దాడి. అధికార పార్టీ హస్తం లేకుండా ఈ దాడి జరగడం అసాధ్యం. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరవయ్యాయి. సీపీఎం పార్టీ కార్యకర్తలపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయ’ని మాణిక్ సర్కార్ విమర్శించారు.ఈ ఆరోపణల్ని విద్యా మంత్రి రతన్ లాల్ నాథ్ ఖండించారు. ‘దాడికి పాల్పడింది భాజపా కార్యకర్తలు కారు. సీపీఎం మాజీ కార్యకర్తలు. 25 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రాన్ని తప్పుపట్టించిన నేతలపై వారు ప్రతీకారం తీర్చుకుంటున్నారు. సీపీఎం భయాందోళనలు నెలకొల్పేందుకు యత్నిస్తోంద’ని ఆరోపించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos