ఎమ్మెల్యేల్ని కొని ప్రభుత్వాల్ని కూల్చేస్తారా మోదీ

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ విధానసభ సభ్యుల్ని కొనటం అంత తేలిక కాదని పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. ఆప్కు చెందిన 14 మంది విధానసభ సభ్యులు తమతో బేరసారాలు సాగిస్తున్నారని కేంద్ర మంత్రి విజయ్ గోయల్ చేసిన ప్రకటనను ఎద్దేవా చేసారు. ‘మరి ఇంకెందుకు అక్కడే ఆగిపోయారు? మీరు ఎంత ఇస్తామన్నారు? వాళ్లు ఎంత అడుగుతున్నారు?’’ అని హేళన చేసారు. ప్రధాని మోదీనీ దుయ్యబట్టారు. ‘మోదీజీ. విపక్ష పాలిత రాష్ట్రాల్లోనూ విధానసభ సభ్యుల్ని కొని ప్రభుత్వాల్ని కూల్చేస్తారా? మీ దృష్టిలో ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? మరి ఇంతమంది ఎమ్మెల్యేలను కొనడానికి మీరు డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మా ఎమ్మెల్యేలను కొనడానికి మీరు చాలాసార్లు ప్రయత్నించారు. ఆప్ నాయకులను కొనడం అంత సులభం కాదు’ అని దుయ్ యబట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos