హొసూరు : తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా రజనీకాంత్ నటించిన దర్బార్ సినిమా విడుదల సందర్భంగా అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రజనీకాంత్ కటౌట్లకు పాలాభిషేకం చేశారు. టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు హొసూరులోని ఓ సినిమా హాలు ముందు రజనీకాంత్ అభిమానుల సంఘం నాయకుడు రోజా పాండ్యన్ అధ్యక్షతన నిర్వహించిన వేడుకల్లో కటౌట్లకు పాలాభిషేకం చేశారు. సినిమా హాలు ముందే పొంగల్ వండి ప్రేక్షకులకు పంచిపెట్టారు. అనంతరం 50 మందికి పైగా హిజ్రాలకు చీరలు పంపిణీ చేసి సత్కరించారు.