ఫ్రీ కాశ్మీర్ కు శివసేన మద్ధతు

ఫ్రీ కాశ్మీర్ కు శివసేన మద్ధతు

ముంబై : జవాహర్లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయం విద్యార్థుల పై జరిగిన దాడికి నిరసనగా ఇక్కడి గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద జరిగిన ప్రద ర్శనలో ఫ్రీ కాశ్మీర్ అని నినాదాలు రాసిన అట్టను పట్టుకున్న పట్టుకున్న మరాఠీ యువతికి శివసేన మద్దతు ప్రకటించింది. ‘కాశ్మీ రీల బాధ మరాఠీ మహిళ అర్థం చేసుకోగలిగింది. దీనిని ప్రతి పక్షాలు దేశద్రోహంగా భావిస్తున్నాయి. బాధ్య తా రాహిత్యానికి ఇంతకంటే చెత్త ఉదాహరణ మరొకటి ఉండదు. ఎవరైనా తమ అభి ప్రాయాలను స్వేచ్ఛగా, భయరహితంగా చెప్పడాన్ని ప్రతి పక్షం, దాని మద్దతు దారులు దేశ ద్రోహంగా భావిస్తోంది. ఇది వారికి, దేశానికి కూడా మంచిది కాద’ని శివసేన పత్రిక – సామ్నాగురువారం తన సంపాదకీయంలో వ్యాఖ్యానించింది. ఆ మహిళ వివరణ తరువాత ప్రతి పక్షం ముఖం చెంప చెళ్లు మనిపించిందని ఆ సంపాదకీయం పేర్కొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos