తెదేపా కాడి పడేసింది

తాడేపల్లి : ‘రాష్ట్రంలో 12 మున్సిపాల్టీలు, కార్పొరేషన్ కు జరుగుతున్న ఎన్నికల్లో తెలుగుదేశం ఇప్పటికే కాడి పడేసింద’ని ముఖ్యమంత్రి సలహాదారు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు.‘ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న అభిప్రాయం ఇప్పటికే తెలిసిపోయింది. తెలుగుదేశం ఇప్పటికే కాడి పడేసింది. చంద్రబాబు చెరలో దశాబ్దాలుగా కుప్పం మగ్గిపోయింది. జగన్ వచ్చాకే సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయి. ఏ ఎన్నికలు వచ్చినా జగన్ పాలనకు ప్రజలు పట్టంగడుతున్నారు. వైఎస్సార్సీపీ ఎప్పుడూ దిగజారుడు రాజకీయాలు చేయలేదు. మా ప్రభుత్వం పనితీరును ప్రజలు మెచ్చు కుంటు న్నా రు. ఓటర్లకు డబ్బులు పంచుతూ టీడీపీ నేతలు అడ్డంగా దొరికారు. రౌడీషీటర్లను టీడీపీ నేతలు.. పార్టీ ఏజెంట్లుగా పెట్టారు. లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేనట్టు చంద్ర బాబు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు అబద్ధాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కుప్పంలో వైఎస్సార్సీపీ గెలుపు ఖాయమన్న నమ్మకం ఉంది. మంచి చేసే నేతలను ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారు. వరుస ఎన్నికల్లో ప్రజలు ఇస్తున్న తీర్పే అందుకు నిదర్శనమ’ని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos