హైదరాబాద్ : ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ నేపథ్యంగా వస్తున్న సైరా సినిమాతో తన కల నెరవేరిందని చిరంజీవి తెలిపారు. ఈ సినిమా టీజర్ విడుదల సందర్భంగా ఏర్పాటు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కథ చాలా ఏళ్ల కిందటే తన దృష్టికి వచ్చినా, ఎక్కువ బడ్జెట్ అవుతుందని ధైర్యం చేయలేకపోయానన్నారు. రామ్ చరణ్, సురేందర్ రెడ్డి ముందుకు రావడంతో తన కల నెరవేరిందన్నారు. తెలుగుతో పాటు వివిధ భారతీయ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని వెల్లడించారు. ఈ సినిమాలో తన గురువు పాత్రను పోషించాలని అమితాబ్ బచ్చన్ను ఫోన్ చేసి కోరగానే, ఆయన వెంటనే ఒప్పుకున్నారని తెలిపారు.