హైదరాబాద్ : తెలుగుతో పాటు కన్నడలో విడుదలైన సైరా టీజర్ రికార్డు సృష్టించింది. దీనిని 24 గంటల్లోనే 30 లక్షల మంది వీక్షించారు. ఇప్పటి వరకు సుదీప్ నటించిన పెహల్వాన్ టీజర్ను 24 గంటల్లో 24 లక్షల మంది చూసినట్లు రికార్డు ఉంది. సైరా ఆ రికార్డును బద్ధలు కొట్టింది. మరో వైపు సైరా నరసింహారెడ్డి దర్శకుడు సురేందర్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. దీనిపై సుదీప్ స్పందిస్తూ, టీజర్పై వస్తున్న ప్రశంసలకు సురేందర్ అర్హులే అని పేర్కొన్నారు. మీ కష్టాన్ని తాను స్వయంగా వీక్షించానని తెలిపారు. ఈ చిత్రంలో సుదీప్ కీలక పాత్రను పోషిస్తున్నారు. అక్టోబరు 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.