లఖ్నవూ: ముజఫర్నగర్ జిల్లాలో శాసనసభ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన భాజపా ఎమ్మెల్యే విక్రమ్ సింగ్ సైనీకి చేదు అనుభవం ఎదురైంది. సొంత నియోజకవర్గం ఖటౌ లీలోని ఒక గ్రామంలో ప్రజలు ఆయనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగు చట్టాలు సహా వేర్వేరు అంశాలపై విక్రమ్ను నిలదీశారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినా దాలు చేశారు. చేసేదేమీ లేక సభా వేదిక వద్ద నుంచి హడావుడిగా వెళ్లిపోయారు విక్రమ్. కారు ఎక్కి, వెళ్లిపోతూ అక్కడివారిని దూషించారు.