ఇది రూ. రెండు లక్షల కోట్ల కుంభకోణం

ఇది రూ. రెండు లక్షల కోట్ల కుంభకోణం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ను మేకవన్నె పులులు పాలిస్తున్నాయని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శించారు. గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయడం వెనుక రెండు లక్షల కోట్ల రూపాయల కుంభకోణం ఉంది. 2019లోనే ఇందుకు సంబంధించి ఒప్పందం కుదిరింది. పోస్కో ప్రతినిధులు ముఖ్యమంత్రి జగన్ తో కూడా భేటీ అయ్యారని పార్లమెంటు సాక్షిగా కేంద్ర ఉక్కు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. కేంద్రం చెప్పిన వివరాలు నిజమా? కాదా? అనే విషయాన్ని జగన్ చెప్పాలి. ఒకవేళ నిజం అయితే. ఏమీ తెలియనట్టు ప్రధాని మోదీకి లేఖ ఎందుకు రాశార’ని ప్రశ్నించారు. కేంద్రంతో, రాష్ట్రానికి జరిగిన చీకటి ఒప్పందాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ, వైసీపీ అగ్రనాయకులు కలిసి విశాఖ ఉక్కు కుంభకోణానికి పాల్పడుతున్నారని జనాలు చర్చించుకుంటున్నారని అన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని గత కాంగ్రెస్ ప్రభుత్వం జాతికి అంకితం చేసిందని… అలాంటి సంస్థను తాము కాపాడుకుంటామని చెప్పారు. విశాఖ స్టీల్ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధమవుతోందని అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos