శవాలపై పేలాలు ఏరుకునే బాబు

శవాలపై పేలాలు ఏరుకునే బాబు

అమరావతి :‘ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేతల మనిషి. ప్రచారానికి ఎప్పుడూ దూరమేన’ని వైకాపా రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి సోమవారం ట్విట్టర్లో వ్యాఖ్యానించారు.‘ ఏదైనా టాస్క్ విజయవంతమైతే ఆ ఘనతను అధికారులకిస్తారు. లోటు పాట్ల ఆ బాధ్యతను తను స్వీకరిస్తారని చెప్పారు. ‘ చంద్ర బాబులా రోజుకు 16 వీడియో కాన్ఫరెన్సులు, మీడియా సమావేశాల హడావుడి లేదు. ఇదంతా పచ్చ మీడియాకు కనిపించదు. శవాలపై పేలాలు ఏరుకునే నైజాన్ని చంద్రబాబు ఎప్పటికీ వదిలి పెట్టడు. పచ్చ మీడియాలో వస్తున్న వార్తలు చూస్తుంటే, ఏడాది కిందట కరోనా వైరస్ వచ్చుంటే బాగుండేదన్న క్రూరత్వం కనిపిస్తోంది. రాజకీయ మనుగడ కోసం ప్రజలు ఎప్పుడూ ఏదో ఒక ఉప ద్రవంలో చిక్కుకోవాలనే స్వభావం బాబుది’అని మండిపడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos