హైదరాబాద్ : ప్రభాస్ కథానాయకుడుగా తెరకెక్కనున్న సాహో సినిమా నుంచి సంగీత త్రయం శంకర్-ఎహసాన్-లాయ్లు ఎందుకు తప్పుకున్నారో వెల్లడైంది. సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి కావస్తున్న సమయంలో వారు తప్పుకోవడం చర్చనీయాంశమైంది. తాము ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో శంకర్ వివరించారు. బయటి కంపోజర్ల నుంచి మరిన్ని పాటలు చేయించుకోవాలని చిత్ర బృందం భావిస్తోందని, ఇది తమకు అసౌకర్యంగా అనిపించిందని వివరించారు. ఇటీవల ఒకే సినిమాకు చాలా మంది సంగీత దర్శకులు బాణీలు అందిస్తూనే ఉన్నారని, ఇదే విషయమై నిర్మాణ సంస్థ తమతో చర్చించిందని వెల్లడించారు. అయితే తమకు ఇష్టం లేని చెప్పేశామన్నారు. ఒక సినిమాకు ఒక సంగీత దర్శకుడే బాణీలు సమకూర్చితే, ఫలానా సినిమాకు ఆయన సంగీతం అందించారని చెప్పడంతోనే గౌరవం దక్కుతుందని వివరించారు. ఈ సినిమాకు సంగీతంతో పాటు నేపథ్య సంగీతం కూడా అందించాలనుకున్నామని, కానీ నిర్మాణ సంస్థ వేరొకరిని నియమించుకుందని చెప్పారు. కనీసం పాటల వరకైనా మమ్మల్ని మాత్రమే తీసుకోవాల్సి ఉండిందని అభిప్రాయపడ్డారు.