న్యూఢిల్లీ : సబ్సిడీయేతర వంట గ్యాస్ ధర బుధవారం పెరిగింది. ఢిల్లీ, ముంబై నగరాల్లో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్కు వరుసగా రూ 144.5, రూ 145 వరకూ పెంచినట్లు ఇండియన్ చమురు సంస్థ తెలిపింది. దీని ప్రకారం ధరలు ఢిల్లీలో రూ 858, ముంబైలో రూ 829, చెన్నైలో రూ 881, కోల్కతాలో రూ 896కు పెరిగాయి. ఏటా 12 సిలిండర్లను ప్రభుత్వం సబ్సిడీకి అందచేస్తున్నారు. అదనపు సిలిండర్ను మార్కెట్ ధరకు కొనుగోలు చేయాలి.