ఢిల్లీ : ప్రపంచ వేదిక మీద క్రికెట్కు మద్దతు తెలిపినందుకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ క్రికెట్ జరుగుతున్న సమయంలో ప్రధాని క్రికెట్ దౌత్యం నెరిపినందుకు ఆయనను ప్రశంసించారు. ఇటీవల మాల్దీవులకు వెళ్లిన ప్రధాని ఆ దేశాధ్యక్షుడికి క్రికెట్ బ్యాట్ బహూకరించిన సంగతి తెలిసిందే. దీనిపై సచిన్ ట్వీట్ చేస్తూ ఈ పరిణామంతో మాల్దీవులు సైతం క్రికెట్ మ్యాప్లో కనిపిస్తుందని ఆశిస్తున్నా అని పేర్కొన్నారు. మాల్దీవుల పర్యటనలో ప్రధాని ఆ దేశాధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్కు భారత జట్టు సభ్యుల సంతకాలతో కూడిన బ్యాట్ను బహూకరించారు. కాగా మాల్దీవులులో క్రికెట్ స్టేడియం నిర్మించాలని భారత్ భావిస్తున్నట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే తెలిపారు.