16న తెరుచుకోనున్న శబరిమల దేవస్థానం

16న తెరుచుకోనున్న శబరిమల దేవస్థానం

తిరువనంతపురం: నెలవారీ ఐదు రోజుల పూజల కోసం శబరిమల దేవస్థానం అక్టోబర్ 16 నుంచి మళ్లీ తెరుచుకోనుంది. కరోనా వల్ల స్వామి అయ్యప్పన్ రోడ్డు మార్గం నుంచి మాత్రమే సన్నిధానానికి రావాలని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు భక్తుల్ని సూచించింది. ముసుగుల్ని ధరించి, కొండమార్గాల్లో చేరుకోవడం భక్తులకు ఇబ్బందిగా ఉంటుందని ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. కొవిడ్ యాంటిజెన్ పరీక్షలో నెగెటివ్ వచ్చిన వారు మాత్రమే స్వామి దర్శనం చేసుకోవాలి. అభిషేకం కోసం నెయ్యిని భక్తులు ప్రత్యేక కౌంటర్లో అంద జేయాలి. ప్రసాదాన్ని కూడా అక్కడే తీసుకోవాలి. నిలక్కల్లో భక్తుల్ని పరీక్షించేందుకు ఆరోగ్య కార్యకర్తల బృందం ఉంటుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos