ఈనెల 30వ తేదీన బాక్సాఫీస్ లెక్కలు సరిచేయడానికి సాహో చిత్రంతో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కిన చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.ఇప్పటికే ట్రైలర్ చిత్రంపై అంచనాలను తారాస్థాయికి మించి దాటించడంతో దేశవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు సాహో కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.కాగా సాహో చిత్రం ప్రీరిలీజ్లో కూడా కొత్త రికార్డులు సృష్టించింది. ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 330 కోట్లకు పైగా జరిగినట్టుగా ప్రచారం జరుగుతోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ.125 కోట్లు పలికాయట. దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలు మొత్తం కలిపి రూ. 46 కోట్లు పలకగా హిందీ వర్షన్ రూ.120 కోట్లకు అమ్ముడయినట్టుగా ప్రచారం జరుగుతోంది. దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా ప్రీ రిలీజ్లోనే అంత మొత్తాన్ని వెనక్కి రాబట్టే అవకాశం ఉందని సినీ జనాలు అభిప్రాయపడుతున్నారు..