అమరావతి: తమ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 13 నుంచి తలపెట్టిన సమ్మెను విరమించినట్లు ఏపీఎస్ ఆర్టీసీ కార్మికుల సంయుక్త కార్యచరణ సమితి బుధవారం ఇక్కడ ప్రకటించింది. ‘ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో బుధవారం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. 27 డిమాండ్ల పరిష్కారానికి జగన్ అంగీకరించార’ని సమితి నేతలు విపులీకరించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ కార్మిక సంఘాలతో యాజమాన్యం ఈ నెల 6న జరిపిన చర్చలు విఫలం కావటంతో ఈ నెల 13 నుంచి సమ్మెకు దిగాలని కార్మికులు నిర్ణయించారు.